సైన్స్ పై విద్యార్థులు దృష్టి పెట్టాలి : కోయ వెంకటేశ్వరరావు

సైన్స్ పై విద్యార్థులు దృష్టి పెట్టాలి : కోయ వెంకటేశ్వరరావు

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంతో దోహదపడతాయని రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్  కోయ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సైన్స్ వైపు విద్యార్థుల దృష్టి ఉండాలని సూచించారు. గురువారం చిక్కడపల్లిలోని సెయింట్ ఆడమ్స్ హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. విద్యార్థులు చేసిన పలు సైన్స్ ఎగ్జిబిషన్ నమూనాలను ఆయన పరిశీలించి అడిగి తెలుసుకొని వారిని ప్రోత్సహించారు.