విజయారెడ్డి హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత : రేవంత్ రెడ్డి

విజయారెడ్డి హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత : రేవంత్ రెడ్డి

విజయారెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో తహసీల్దార్ ను పాశవికంగా హత్య చేసినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ అస్తవ్యస్థ విధానాల వల్లే భూ వివాదాలు పెరిగిపోయాయని ఆరోపించారు.

రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విజయారెడ్డి హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి  డిమాండ్ చేశారు.