కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగిండని ఆరోపించారు.
నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మిత్ర పార్టీ బీజేపీ, 40 శాతం కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందన్నారు. మళ్లీ అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిస్తుందన్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, బీఆర్ఎస్ నేతలు ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నారని ధ్వజమెత్తారు రేవంత్. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయమని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తుందని..తెలంగాణ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.
అంతకుముందు మాట్లాడిన కేటీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సరిగ్గా 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని.. అక్కడి రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని వీడియో ట్వీట్ చేశారు కేటీఆర్.
బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు.
— Revanth Reddy (@revanth_anumula) October 21, 2023
తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగిండు.
నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్ళ మిత్ర పార్టీ బీజేపీ, 40% కమిషన్లతో… https://t.co/wDUnUlYPlo