మన ఉద్యోగాలు మనగ్గావాలన్న ఉద్యమ ఆకాంక్షకు టీఆర్ఎస్ సర్కారు ఢిల్లీ దాకా తూట్లు పొడిచిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. తెలంగాణ భవన్ లో మన బిడ్డల పట్ల వివక్షే అందుకు నిదర్శనమన్నారు. విద్యార్థుల ఆందోళనలు తుది దశ ఉద్యమ సంకేతాలని.. కేసీఆర్ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు రేవంత్. ఢిల్లీ తెలంగాణ భవన్ లో నార్త్ ఇండియా వాళ్లకు జాబులెట్ల ఇస్తరు? అని వెలుగు పేపర్ లో వచ్చిన న్యూస్ క్లిప్ ను రేవంత్ షేర్ చేశారు.
మన ఉద్యోగాలు మనగ్గావాలన్న ఉద్యమ ఆకాంక్షకు టీఆర్ఎస్ సర్కారు తూట్లు పొడిచింది. కేసీఆర్ పాలనలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్యాయం అనేక రెట్లైంది. తెలంగాణ భవన్ లో మన బిడ్డల పట్ల వివక్షే దీనికి మరో నిదర్శనం. ఈ ఆందోళనలు తుది దశ ఉద్యమ సంకేతాలు. సిద్ధంగా ఉండు కేసీఆర్! pic.twitter.com/rDMDJYCPAX
— Revanth Reddy (@revanth_anumula) July 24, 2021