ఆ ఐదు సిక్సర్లు నా జీవితాన్ని మార్చాయి: రింకూ సింగ్‌‌

ఆ ఐదు సిక్సర్లు నా జీవితాన్ని మార్చాయి: రింకూ సింగ్‌‌

డబ్లిన్‌‌: ఈ ఏడాది ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌లో కొట్టిన ఐదు వరుస సిక్సర్లు తన జీవితాన్ని మార్చేశాయని టీమిండియా హిట్టర్‌‌ రింకూ సింగ్‌‌ అన్నాడు. ఆ క్షణాలు తన కెరీర్‌‌ను మలుపు తిప్పిందని గుర్తు చేశాడు. గుజరాత్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఆఖరి ఓవర్‌‌లో వరుసగా ఐదు సిక్స్‌‌లు కొట్టి కోల్‌‌కతాను గెలిపించాడు. అప్పట్నించి ఇండియన్‌‌ క్రికెట్‌‌లో రింకూ చాలా పాపులర్‌‌ అయ్యాడు. ‘ఆ ఐదు సిక్స్‌‌లు నా జీవితాన్ని ఎంతగానో మార్చింది. క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ ఆ క్షణాలను ఇంకా గుర్తుంచుకున్నారు. 

వాళ్లు నా గురించి చర్చించడం చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. నా పట్ల చాలా కృతజ్ఞత చూపెడుతున్నారు’ అని రింకూ పేర్కొన్నాడు. ఐర్లాండ్‌‌తో సిరీస్‌‌లో ఇంటర్నేషనల్‌‌ డెబ్యూ చేసిన రింకూ.. మ్యాచ్‌‌ చివరి వరకు క్రీజులో ఉండటం తనకు చాలా ఇష్టమన్నాడు. మ్యాచ్‌‌ ఆఖర్లో భారీ షాట్లు కొట్టి గెలిపించడం చాలా 
ఉత్సాహాన్నిస్తుందన్నాడు. ఐర్లాండ్‌‌తో తొలి మ్యాచ్‌‌లో బ్యాటింగ్‌‌ కోసం ఆతృతగా ఎదురు చూశానని చెప్పాడు. సిరీస్‌‌ గెలిచిన తాము ఆఖరి మ్యాచ్‌‌ను అత్యుత్తమ స్థాయిలో ముగించాలని 
కోరుకుంటున్నట్లు చెప్పాడు.