పంత్​కే ఢిల్లీ పగ్గాలు

పంత్​కే ఢిల్లీ పగ్గాలు
  • రెండు రోజుల్లో ఐపీఎల్‌‌ ఫేజ్‌‌2

దుబాయ్‌‌: ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కెప్టెన్సీ అంశంలో కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్‌‌కు ఆ ఫ్రాంచైజీ గురువారం తెరదించింది. 2021 ఎడిషన్‌‌ ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో తమ జట్టును నడిపించిన రిషబ్‌‌ పంతే.. యూఏఈ లెగ్‌‌లోనూ కెప్టెన్‌‌గా ఉంటాడని ప్రకటించింది. భుజం గాయం వల్ల రెగ్యులర్‌‌ కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ఇండియాలో జరిగిన 14వ ఎడిషన్‌‌ ఫస్ట్‌‌ ఫేజ్‌‌కు దూరమయ్యాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్‌‌ 14 మధ్యలో ఆగిపోయింది. మళ్లీ ఈ ఆదివారం సీజన్‌‌ రీస్టార్ట్‌‌ అవుతుంది. అనుకోకుండా దొరికిన ఈ  నాలుగు నెలల బ్రేక్‌‌లో అయ్యర్‌‌ రికవర్‌‌ అయ్యాడు. అంతేకాక ప్రస్తుతం జట్టుతో కలిసి ప్రాక్టీస్‌‌ కూడా చేస్తున్నాడు. దీంతో పంత్‌‌, అయ్యర్‌‌లో ఎవరికి కెప్టెన్సీ ఇస్తారనే చర్చ జరిగింది. ఎట్టకేలకు ఈ చర్చకు ఫ్రాంచైజీ తెరదించింది. కాగా, పంత్‌‌ కెప్టెన్సీలోని ఢిల్లీ.. ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో అదరగొట్టింది.  ఎనిమిది మ్యాచ్‌‌ల్లో ఆరు విజయాలు సాధించి ప్రస్తుతం టేబుల్‌‌ టాపర్‌‌గా ఉంది.