ఓటేసి వస్తుండగా రోడ్ ఆక్సిడెంట్: ఒకరి మృతి

ఓటేసి వస్తుండగా రోడ్ ఆక్సిడెంట్: ఒకరి మృతి

మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ వద్ద టూవీలర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర  గాయాలయ్యాయి. ఆకుల రాములు అనే అతను సికింద్రాబాద్ లోని కుషాయిగూడలో నివాసం ఉంటున్నాడు. రెండవ పరిషత్ ఎన్నికల్లో ఓటేయడానికి తన తమ్ముడు కొండయ్యతో కలిసి అతని సొంత ఊరైన  యాదాద్రి భువనగిరి జిల్లా బేగం పేటకు వెళ్లారు. ఓటు ప్రక్రియ ను పూర్తి చేసుకుని వీరు శుక్రవారం సిటీకి పయనమయ్యారు. అయితే మేడ్చెల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీరి టూవీలర్ ను ఢీకొట్టింది. దీంతో.. ఆకుల రాములు అక్కడికక్కడే మృతి చెందగా.. కొండయ్య కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థాలానికి వెళ్లిన పోలీసులు కొండయ్యను హాస్పిటల్ కు తరలించి… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.