నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

 నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండల కేంద్రం దగ్గరలో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగట్ల దగ్గర ఆగివున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదంలో కారులోని ఐదుగురు స్పాట్ లో చనిపోయారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ అల్వాల్ లోని వెస్ట్ వెంకటాపురం వాసులుగా గుర్తించామన్నారు పోలీసులు. మృతుల్లో నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య ఉన్నారు. వీరికి ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి, ఈ నెల 3న షామీర్ పేటలో రెసిప్షెన్ జరిగింది. 

వధూవరులతో పాటు బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మీ, రవికుమార్ తో సహా మరో బాలుడు చనిపోయాడు. దీంతో హైదరాబాద్ లోని నివాసంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నంద్యాలకు బయలుదేరారు.