ముంబై: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ను ప్రభుత్వం నియమించింది. ఈయన మూడేళ్లు పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న జైన్, రవిశంకర్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం కేంద్ర బ్యాంకులో నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి. వీరిలో ఇద్దరు బ్యాంకు అధికారుల నుంచి, ఒకరు కమర్షియల్ బ్యాంకర్, ఒకరు ఆర్థికవేత్త ఉండాలి.
