న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బోర్డర్–గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. గ్రోయిన్ ఇంజ్యురీ నుంచి కోలుకున్న స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ.. ఫిట్నెస్ పరీక్ష పాసయ్యాడు. శుక్రవారం ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలన్నింటిలోనూ అతను మంచి ఫలితాలను సాధించాడు. దీంతో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు హిట్మ్యాన్కు లైన్ క్లియర్ అయ్యింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సోమవారమే రోహిత్.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. అయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ముంబైకర్.. 14 రోజుల మాండేటరీ క్వారంటైన్లో ఉండనున్నాడు. దీంతో తొలి రెండు టెస్ట్లను మిస్ అవుతున్న రోహిత్… లాస్ట్ రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాడు. ఇండియా నుంచి నేరుగా సిడ్నీకి వెళ్లనున్న రోహిత్.. వారం రోజుల పాటు ట్రెయినింగ్ కూడా చేసే చాన్స్ ఉంది. ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ రోహిత్ను మొదట్లో ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదు. దీనిపై విమర్శలు రావడంతో టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. అయితే టీమ్తో పాటు ఆసీస్ వెళ్లకుండా ఇండియాకు తిరిగి వచ్చిన రోహిత్ ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమించి సక్సెస్ అయ్యాడు.