- ఢిల్లీ పోలీసులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై దాడి జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీని తమకు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని సిసోడియా ఇచ్చిన అప్లికేషన్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆ రోజు ఏం జరిగిందో తెలిపే సీసీటీవీ ఫుటేజ్ను ఇవ్వాలని ఆదేశించింది.