- ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం: డాక్టర్ ఎం.వి.రావు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు యశోద ఆస్పత్రిలో చేస్తున్న వైద్య పరీక్షల పై ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు మీడియాకు వివరణ ఇచ్చారు. ‘‘ సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. వారు స్టేబుల్ గా ఉన్నారు. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే.’ అని డాక్టర్ ఎం.వి.రావు వివరించారు.
ఇవి కూడా చదవండి