పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు

షార్జా: ఐపీఎల్-13లో భాగంగా గురువారం షార్జా వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచింది బెంగళూరు. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  హిట్టర్‌ క్రిస్‌గేల్‌ టీమ్‌లోకి వచ్చినట్లు పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. మన్‌దీప్‌ సింగ్‌కు గాయమైందని చెప్పాడు. దీపక్‌ హుడా, మురుగన్‌ అశ్విన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు రాహుల్‌.

పంజాబ్ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు  ఆడగా ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.  సెప్టెంబర్‌ 24న జరిగిన తమ తొలి పోరులో బెంగళూరుపై పంజాబ్‌ ఘన విజయం సాధించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిన పడాలని రాహుల్‌సేన భావిస్తోంది. పాయింట్ల పట్టికలో బెంగళూరు(5గెలుపు, 2ఓటమి) మూడో స్థానంలో కొనసాగుతోంది.

టీమ్స్: