
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్ బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-–-I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్–--III పోస్టులను భర్తీ చేయనున్నారు. రైల్వేలోని 18 జోన్ల పరిధిలో మొత్తం 6238 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్బీ టెక్నికల్ పోస్టుల భర్తీ విధానం గురించి తెలుసుకుందాం.
పోస్టుల సంఖ్య: 6 వేల 238
పోస్టులు: టెక్నీషియన్ గ్రేడ్-–--I సిగ్నల్ 183,
టెక్నీషియన్ గ్రేడ్--–-III 6055.
ఎలిజిబిలిటీ
టెక్నీషియన్ గ్రేడ్–---I సిగ్నల్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇనుస్ట్రుమెంటేషన్, బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత ట్రేడులో మూడేండ్ల డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్--–-III పోస్టులకు పదో తరగతి లేదా సమాన అర్హతతోపాటు ఫిట్టర్, ఎలక్ట్రిషీయన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెకట్రానిక్స్, మెకానిక్ (డిజిల్), మెకానిక్(మెటర్ వెహికల్), వెల్డర్, మెషినిస్ట్ ట్రేడుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: టెక్నీషియన్ గ్రేడ్---–-I పోస్టులకు 18 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్---–--III పోస్టులకు 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 28.
లాస్ట్ డేట్: జులై 28.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల రూ.250. ఇతర అభ్యర్థులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: టెక్నీషియన్ గ్రేడ్-–I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్–-III పోస్టులకు వేర్వేరుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్
మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది. ఎగ్జామ్ 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 ప్రశ్నలు 15 మార్కులు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 ప్రశ్నలు 20 మార్కులు, మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు 20 మార్కులు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 25 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటుంది. సీబీటీ ఎగ్జామ్ మల్టిపుల్ షిప్టుల్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడుతారు. సీబీటీలో అన్ రిజర్వ్ డ్ 40 శాతం, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్) 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ 25 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
టెక్నీషియన్ గ్రేడ్-III
మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది. ఎగ్జామ్ 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ సైన్స్ 40 ప్రశ్నలు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సీబీటీ ఎగ్జామ్ మల్టిపుల్ షిప్టుల్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడుతారు. సీబీటీలో అన్ రిజర్వ్డ్ 40 శాతం, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ 25 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.