రూపాయి వంద దాటినా డోంట్కేర్:ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియా

రూపాయి వంద దాటినా డోంట్కేర్:ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియా
  •     95.60 స్థాయికి పెరుగుదల
  •     ఇది వంద దాటినా డోంట్​కేర్​
  •     ఆర్థిక సంఘం చైర్మన్​ పనగరియా

న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు తగ్గడం, రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవచ్చనే అంచనాలతో రూపాయి శుక్రవారం 76 పైసలు పుంజుకొని రూ.95.60 వద్ద ముగిసింది. ఇరాన్​తో యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయని అమెరికా చేసిన ప్రకటనతోనూ ఊరట లభించిందని ఫారెక్స్​ ట్రేడర్లు చెప్పారు. యూఎస్​ ట్రెజరీ రాబడులు తగ్గడం, స్టాక్​ మార్కెట్లు లాభపడటం కూడా రూపాయికి కలిసి వచ్చింది. 

ఇదిలా ఉంటే, రూపాయి విలువ తగ్గినా తదనంతరం కోలుకుంటుందని,  విలువ రూ.100 మార్కును తాకినా ఆర్​బీఐ జోక్యం చేసుకోవద్దని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా పేర్కొన్నారు. చమురు ధరలు తగ్గితే రూపాయి విలువ పెరుగుతుందని, విలువ ఎక్కువ ఉండటం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఎక్స్ ​పోస్టులో రాశారు. ఈ ఏడాది మన కరెన్సీ విలువ సుమారు ఏడు శాతం తగ్గింది. రానున్న నెలల్లో ఇది రూ.97.5 మార్కును దాటవచ్చని అంచనా.