ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.1,435 కోట్లు చెల్లింపు

ఇందిరమ్మ లబ్ధిదారులకు  రూ.1,435 కోట్లు చెల్లింపు

హైదరాబాద్ , వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి  ఇంతవరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ. గౌతమ్ తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇండ్ల పనులు ప్రారంభం కాగా, 1.29 లక్షల ఇండ్ల పనులు పురోగతిలో ఉన్నాయని వాటిలో సుమారు 20 వేల ఇండ్ల గోడలు, 8,633 స్లాబ్స్  పూర్తి అయ్యాయని  సోమవారం (సెప్టెంబర్ 15) పత్రిక ప్రకటనలో ఎండీ పేర్కొన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇండ్లకు గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇండ్ల నిర్మాణ పురోగతిని బట్టి, ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా  నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామని వివరించారు. అందులో భాగంగా సోమవారం 13,841 మంది లబ్ధిదారులకు రూ. 146.30 కోట్లను విడుదల చేశామని వెల్లడించారు.