- సింగరేణి ఆఫీసర్లు, వర్కర్లకు రూ. 50 లక్షల ప్రమాద బీమా
- డెరెక్టర్ ఎన్.బలరాం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు, కార్మికులకు రూ.50 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ఎన్.బలరాం వెల్లడించారు. కొత్తగూడెంలోని హెడ్డాఫీస్లో బుధవారం ఆయన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్స్టేట్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. బీమా చెల్లింపుపై చర్చించారు. ఈ సందర్భంగా డైరెక్టర్మాట్లాడుతూ.. కంపెనీలో పనిచేసే ఆఫీసర్, వర్కర్ప్రమాదవశాత్తు మరణిస్తే, వారికి హెచ్ డీఎఫ్సీ బ్యాంక్లో కార్పొరేట్శాలరీ అకౌంట్ ఉన్నట్లయితే రూ.40 లక్షల ప్రమాద బీమా వస్తుందన్నారు. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిడ్ కార్డు వాడుతున్నట్లయితే అదనంగా మరో రూ. 10 లక్షలు చెల్లించనున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్వర్కర్స్ కు రూ.30లక్షల ప్రమాద బీమా వస్తుందన్నారు. అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే వారికి రోజుకు రూ.వెయ్యి చెప్పున 15 రోజులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంపెనీ ఉద్యోగులు విమాన ప్రమాదంలో మృతి చెందితే కోటి రూపాయల ప్రమాద బీమా చెల్లిస్తామన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగి ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున ఫీజు రీయింబర్స్మెంట్ఇవ్వనున్నట్టు బ్యాంక్ఆఫీసర్లు వివరించారు. పూర్తి వివరాలకు వర్కర్స్ సంబంధిత మైన్ల వెల్ఫేర్ఆఫీసర్లను కలవాలని జీఎం పర్సనల్ఎ.ఆనందరావు సూచించారు. మీటింగ్లో జీఎం వెల్ఫేర్కె.బసవయ్య, సింగరేణి ఆఫీసర్లు సుబ్బారావు, రమేశ్బాబు, వెంకటరమణ, హనుమంతరావు, కొమరయ్య, కవితానాయుడు, హరినారాయణ్పాల్గొన్నారు.
