పెంట్ హౌస్ కు 71 వేల కరెంట్ బిల్లు..

పెంట్ హౌస్ కు 71 వేల కరెంట్ బిల్లు..

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని హైదర్ షా కోట్ గ్రామంలో బాల్ రెడ్డి అనే వ్యక్తి పెంట్ హౌజ్ కు విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా 71 వేల బిల్లు వేశారు. మూడు నెలలుగా బిల్లు రాకపోవటంతో పలుమార్లు బాల్ రెడ్డి విద్యు త్ శాఖ అధికారులను కలిశాడు. అయిన వాళ్లు పట్టించుకోలేదు. బుధవారం ఏకంగా రూ. 70, 939 బిల్లును ఆయన చేతిలో పెట్టారు. దీంతో బాల్ రెడ్డి షాక్ అయ్యారు. బిల్లు సంగతి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవటం లేదని ముందు డబ్బులు కట్టాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ మీడియాను సంప్రదించాడు. నెలకు 500 నుంచి వెయ్యి రూపాయల మధ్య తనకు బిల్లు వస్తుందని అలాంటిది 71 వేల బిల్లు కట్టమంటే ఎలా అని బాధితుడు ప్రశ్నించాడు.

 see more news

సంపదకు సంతోషానికి సంబంధం ఉంటదా?

స్టార్లు మాకొద్దు.. ఫ్రాంచైజీలు వదిలేసిన టాప్ ప్లేయర్లు వీళ్లే..

పాత బస్తీలో సిలిండర్ పేలి 13 మందికి గాయాలు

భార్య, కూతురిని దారుణంగా చంపిన భర్త