మున్సి పల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 89 లక్షల క్యాష్.. 84 లక్షల లిక్కర్: కమిషనర్ రాణి కుముదిని

  మున్సి పల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా  89 లక్షల క్యాష్.. 84 లక్షల లిక్కర్: కమిషనర్ రాణి కుముదిని
  •  మున్సిపోల్స్​లో సీజ్ చేసినట్టు వెల్లడించిన ​రాణి కుముదిని 

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్​ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.89 లక్షల క్యాష్, రూ.84 లక్షల విలువైన లిక్కర్​సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని శనివారం ప్రకటించారు. రూ.13.27 లక్షల విలువ చేసే డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, రూ.78 వేల విలువ చేసే ట్యా బ్స్​కూడా సీజ్​చేశామని తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన ఎంసీసీ కమిటీలు పకడ్చందీగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఏవైనా కంప్లైంట్స్ ఉంటే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి 9247597066 నంబర్​ అందుబాటులో ఉంటుందని కమిషనర్ ప్రకటించారు. 

గెజిటెడ్​ ఆఫీసర్లను శిక్షణ

మున్సిపల్​మేయర్, చైర్​పర్సన్​ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమించిన గెజిటెడ్​ ఆఫీసర్లకు శనివారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. జిల్లాల వారీగా మాస్టర్​ట్రైనర్లు వీరికి శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు.