ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు :  రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతల సెల్ ఫోన్లను సర్కారు హ్యాక్​చేయిస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో సామాన్యుల నుంచి లీడర్ల దాకా ఎవరి ఫోన్లకూ సేఫ్టీ లేదని, ముఖ్యంగా అపోజిషన్​ లీడర్లు ధైర్యంగా సెల్​ఫోన్​వాడే పరిస్థితి లేదన్నారు. తన ఫోన్​ కూడా హ్యాక్​ అయిందని, స్వయంగా ఆపిల్​ నుంచి మెయిల్​వచ్చిందని, దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్​జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్​ చేశారు. ఇది పిరికిపంద చర్య అని అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) నియోజక వర్గంలో చేపట్టబోయే పది రోజుల యాత్రను సోమవారం ప్రవీణ్​కుమార్​ కాగజ్​నగర్​లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బీఆర్ ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు తమను ప్రశ్నించే నేతల ఫోన్లను ట్యాపింగ్​, హ్యాకింగ్​ చేయిస్తున్నాయన్నారు. 

రాష్ట్ర సర్కారు కుంభకోణాల్లో మునిగిపోయింది

రాష్ట్ర సర్కారు కుంభకోణాల్లో మునిగిపోయిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ప్రవీణ్​కుమార్​ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యే కోనప్ప అండతో భూఆక్రమణలు జరుగుతున్నాయన్నారు. ధరణి పోర్టల్​కబ్జాకోరుల కోసమే తెచ్చినట్లుందన్నారు.