చనిపోయిన అభ్యర్థుల ఫ్యామిలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

చనిపోయిన అభ్యర్థుల ఫ్యామిలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: పోలీస్ ఈవెంట్స్ లో చనిపోయిన అభ్యర్థుల ఫ్యామిలీలను ప్రభుత్వమే ఆదుకోవాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమ, మంగళవారాల్లో అన్ని గ్రామాల్లో క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వి వాంట్ జాబ్స్, నాట్ డెత్స్ (ఉద్యోగాలు ఇవ్వండి~ ఊపిరి తీయకండి ) నినాదంతో ర్యాలీ జరుగుతుందని తెలిపారు.

పోలీస్ ఈవెంట్లు జరుగుతున్న చోట కనీసం అంబులెన్స్ లు కూడా ఏర్పాటు చేయటం లేదని ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. అస్వస్థతకు గురైన మహేశ్ అనే యువకుడిని మధ్యహ్నం 3 గంటల వరకు హాస్పిటల్ కు తీసుకెళ్లలేదని గుర్తు చేశారు. పోలీస్ ఈవెంట్ల లోపాలపై ఇతర పార్టీల నేతలెవ్వరూ మాట్లాడక పోవడం విచారకరమన్నారు. ఇక, వచ్చే నెల 2 నుంచి బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార పాదయాత్ర స్టార్ట్ చేయనున్నట్లు ఆర్ఎస్పీ తెలిపారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి యాత్ర మొదలు పెడతామన్నారు.