
ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ సర్కార్.. ప్రజలకు లోన్లు, దళిత బంధు ఇస్తామని చెబితే ఎలా నమ్మాలని బీఎస్పీ స్టేట్చీఫ్ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎన్నికల లబ్ధి కోసం ప్రజల సొమ్మును స్కీముల రూపంలో పంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జీతాలు ఆపడంతోనే రవీందర్ అనే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ప్రవీణ్కుమార్గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లా కాగజ్ నగర్ లో పర్యటించారు.
వంజిరీ చౌరస్తా నుంచి కాగజ్ నగర్ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల బతుకులు మార్చేందుకే సిర్పూర్.టి లో బరిలో నిలిచానని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని కోరారు. బుద్వేల్లో అసైన్డ్ భూములు గుంజుకొని ప్రైవేట్కంపెనీకి వందల ఎకరాల భూములు కేటాయించారన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే, జేకే పేపర్ మిల్ బంద్ చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జమిలి ఎన్నికలతో రాష్ట్రాలకు నష్టం
జమిలీ ఎన్నికలతో రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోల్పోతాయని ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ చెప్పారు. కేంద్రం ఇండియా పేరు మార్చాలనుకోవడం సరికాదన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్పాల్గొని మాట్లాడారు. వివిధ పార్టీల నాయకులు బీఎస్పీలో చేరారు.