అంబులెన్స్ను ఢీకొన్న పల్లె వెలుగు బస్సు

అంబులెన్స్ను ఢీకొన్న పల్లె వెలుగు బస్సు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ దగ్గర అంబులెన్స్ను పల్లె వెలుగు బస్సు ఢీకొంది. పల్లె వెలుగు బస్సు వేగంగా అంబులెన్స్ ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. స్థానికులు డ్రైవర్ ని హాస్పిటల్ కు తరలించారు.

బస్సు నడిపిన డ్రైవర్ ఘటన అనంతరం పరారు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.