కాలువలో పడిన బస్సు.. ప్రయాణికులకు తీవ్రగాయాలు

కాలువలో పడిన బస్సు.. ప్రయాణికులకు తీవ్రగాయాలు

ఏపీలోని విజయనగరం జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. గురుగుబిల్లి మండలం తోటపల్లి దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నాగావళి నది కాలువలో బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలు కాగా…ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని దగ్గర్లోని దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చిలవేలంగికి చెందిన కొంతమంది.. కాశీయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయినట్టుగా తెలుస్తోంది.