ముందు బండిని తప్పించబోయి.. పొలాల్లోకి వెళ్లిన రాజధాని బస్సు

ముందు బండిని తప్పించబోయి.. పొలాల్లోకి వెళ్లిన రాజధాని బస్సు

సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మోతె మండలం మావిళ్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు రహదారి పక్కకు దూసుకుపోయింది. ముందు వెళ్తున్న వాహనం టైరు పగలడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు మల్లించాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే

 హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు సూర్యాపేట జిల్లా మావిళ్లగూడెం వద్దకు వెళ్లగానే బస్సు ముందు వెళ్తున్న వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో  అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు మల్లించాడు. బస్సు కంట్రోల్ తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.