శ్రామిక్ పోస్టులను అప్రెంటిస్షిప్ చేసినవారికే ఇవ్వాలి : బక్క జడ్సన్

శ్రామిక్ పోస్టులను అప్రెంటిస్షిప్ చేసినవారికే ఇవ్వాలి : బక్క జడ్సన్
  •  ఆర్టీసీ నియామకాలు పోలీస్​శాఖ చేపట్టడం అన్యాయం: బక్క జడ్సన్​  

పంజాగుట్ట, వెలుగు: ఆర్టీసీ శ్రామిక్ నియామకాల్లో పాత పద్ధతినే అవలంబించాలని సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్​డిమాండ్ చేశారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్ షిప్​చేసిన అభ్యర్థుల ఆవేదన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజారై మాట్లాడారు. వీరు అతి తక్కువ గౌరవ వేతనానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల్లో పని చేశారననారు. అప్రెంటిస్​షిప్​పూర్తయ్యాక రెగ్యులర్​ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. 

గతంలో ఆర్టీసీ నియామకాలు ఆ సంస్థ ద్వారానే జరిగాయని, ప్రస్తుతం పోలీస్​శాఖ చేపట్టడం వల్ల పాత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​కల్పించుకుని ఆర్టీసీ ద్వారానే నియామక ప్రక్రియను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజీవ్, మంగీలాల్, విజయ్, సామేల్, ఎల్లారావు, నాగరాజు,  సయ్యద్ గౌసొద్దీన్​తదితరులు పాల్గొన్నారు.