- మా సమస్యలు పరిష్కరించండి
హైదరాబాద్,వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర న్యాయం జరిగిందని, కాంగ్రెస్ సర్కార్ మాకు న్యాయం చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరారు. బుధవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు సుమారు 50 మంది కార్మికులు వెళ్లి నిరసన తెలిపారు. కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు చిన్న కారణాలతో సస్పెండ్ , మెమో, జీతాలు కట్ చేయడమే కాకుండా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్లు లేక కుటుంబాలు పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం ముగ్గురు ప్రతినిధులను పోలీసులు లోపలికి అనుమతించడంతో సీఎం పీఏకు వినతిపత్రం అందజేశారు.
