
రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 14న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. లారెన్స్ మాట్లాడుతూ ‘సినిమాలోని మదర్ సెంటిమెంట్ నా మనసుని ఆకట్టుకుంది.
నా ప్రతి చిత్రంలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాను. ఇందులో ఫ్యామిలీతో పాటు మాస్, యాక్షన్, డ్యాన్స్ సహా అన్ని ఉంటాయి. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. ‘స్క్రీన్ మీద కాదు రియల్ లైఫ్లో హీరోగా ఉండాలి’ అని మా అమ్మ చెబుతూ ఉంటుంది. అందుకే సేవా కార్యక్రమాల ద్వారా నా వల్ల ఎంత సాయం చేయగలుగుతానో అంత చేస్తాను’ అన్నాడు. ఇందులో పార్ట్ అవడం హ్యాపీగా ఉందంది ప్రియా. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ‘డ్యాన్స్ మాస్టర్గా, నటుడిగా, దర్శకుడిగా, వ్యక్తిగా లారెన్స్ ఎందరికో స్ఫూర్తి. ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. నటుడు సొహైల్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.