లాంగ్వేజీ టీచర్లకు స్పౌజ్ బదిలీలు చేపట్టండి

లాంగ్వేజీ టీచర్లకు స్పౌజ్ బదిలీలు చేపట్టండి
  • సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఆర్‌‌‌‌యూపీపీ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజీ టీచర్లకు, పీడీలకు స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ (ఆర్‌‌‌‌యూపీపీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతకుంట జగదీశ్, ఎం.శంకర్  కోరారు. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. జీవో 317 సబ్ కమిటీ స్పౌజ్ బదిలీలు చేయాలని కోరినా.. స్కూల్ అసిస్టెంట్ హిందీ, తెలుగు, పీడీలకు అవకాశం ఇవ్వలేదన్నారు. 

ఈ బదిలీలు జరగని వారిలో 95 శాతం మంది మహిళా టీచర్లే ఉన్నారని, వారు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే లాంగ్వేజీ స్కూల్ అసిస్టెంట్లకు స్పౌజ్ బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు భాషా పండితులకు ప్రమోషన్లు ఇచ్చాకే మిగిలిపోయిన సుమారు 800 మందికి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నేతలు దార్ల రాఘవేంద్రచారి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.