
కిగాలీ: మందు కొట్టేందుకు బార్కు వెళ్లడం, అక్కడ ఉండే మహిళలను పరిచయం చేసుకోవడం అతడు హాబీగా మార్చుకున్నాడు. అందులో ఫ్రెండ్స్ సర్కిల్, బంధువులు ఎక్కువగా లేనివాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి, ఫోన్లు, డబ్బులన్నీ దోచుకునేవాడు. ఆపై గొంతుకోసి చంపేసి, ఇంటివెనక ఉన్న కిచెన్ దగ్గరే డెడ్బాడీలను పాతిపెట్టాడు. ఇలా 14 మంది వేశ్యలను చంపేసిన సీరియల్ కిల్లర్ను రువాండా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
కిగాలీ సిటీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న 34 ఏండ్ల నిందితుడు.. టీవీల్లో క్రైమ్ షోలు చూసి మర్డర్లు ఎలా చేయొచ్చో స్టడీ చేసి ఈ హత్యలు చేశాడు. బార్లలో మహిళలను పరిచయం చేసుకుని ఇంటికి తీసుకువచ్చి వస్తువులు, డబ్బులు కాజేసేవాడు. ఆపై వాళ్లను చంపి కిచెన్లోనే గొయ్యి తీసి పాతి పెట్టేవాడు. అలా 14 మందిని చంపేశాడు. ఇందులో కొంతమంది ‘గే’లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.