14 మంది వేశ్యలను చంపేసిండు.. సీరియల్ కిల్లర్ అరెస్ట్

14 మంది వేశ్యలను చంపేసిండు..   సీరియల్ కిల్లర్ అరెస్ట్

కిగాలీ: మందు కొట్టేందుకు బార్​కు వెళ్లడం, అక్కడ ఉండే మహిళలను పరిచయం చేసుకోవడం అతడు హాబీగా మార్చుకున్నాడు. అందులో ఫ్రెండ్స్​ సర్కిల్, బంధువులు ఎక్కువగా లేనివాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి, ఫోన్లు, డబ్బులన్నీ దోచుకునేవాడు. ఆపై గొంతుకోసి చంపేసి, ఇంటివెనక ఉన్న కిచెన్​ దగ్గరే డెడ్​బాడీలను పాతిపెట్టాడు. ఇలా 14 మంది వేశ్యలను చంపేసిన సీరియల్ కిల్లర్​ను రువాండా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 

కిగాలీ సిటీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న 34 ఏండ్ల నిందితుడు.. టీవీల్లో క్రైమ్ షోలు చూసి మర్డర్లు ఎలా చేయొచ్చో స్టడీ చేసి ఈ హత్యలు చేశాడు. బార్లలో మహిళలను పరిచయం చేసుకుని ఇంటికి తీసుకువచ్చి వస్తువులు, డబ్బులు కాజేసేవాడు. ఆపై వాళ్లను చంపి కిచెన్​లోనే గొయ్యి తీసి పాతి పెట్టేవాడు. అలా 14 మందిని చంపేశాడు. ఇందులో కొంతమంది ‘గే’లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.