
న్యూఢిల్లీ: తన బ్యాటింగ్తో క్రికెట్ప్రపంచాన్ని శాసించిన.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం 47వ పడిలోకి అడుగుపెట్టాడు. కరోనా వైరస్తో పోరాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్కు గౌరవార్థంగా బర్త్డే సెలబ్రేషన్స్కు దూరంగా ఉన్న మాస్టర్.. సాదాసీదాగా గడిపేశాడు. ఉదయాన్నే తల్లి పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న సచిన్కు.. గణపతి బొమ్మ రూపంలో ఆమె ఫస్ట్గిఫ్ట్ ఇచ్చింది. జీవితంలో తొలిసారి బర్త్డే వేడుకలకు దూరంగా ఉన్నా.. తల్లి ఇచ్చిన వెలకట్టలేని కానుకతో ఉప్పొంగిపోయాడు. ఇక క్రీడా ప్రపంచం మొత్తం సచిన్కు బర్త్డే విషెస్ చెప్పేందుకు పోటీపడింది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా మధురానుభవాలను పంచుకున్నారు. ‘సచిన్, సచిన్, సచిన్, హ్యాపీ బర్త్డే’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్చేశారు. స్టేడియంలో మాస్టర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు చేసే చాంటింగ్ను స్ఫూర్తిగా తీసుకుని మోడీ మూడుసార్లు సచిన్ అంటూ రాసుకొచ్చారు. ఇక ‘ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని’ బీసీసీఐ ప్రెసిడెంట్సౌరవ్ గంగూలీ, ‘నీ బ్యాటింగ్తో కాలాన్నే ఆపేశావు’ అంటూ సెహ్వాగ్, ‘క్రికెట్పై ఉన్న మక్కువతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచావని’ టీమిండియా కెప్టెన్విరాట్కోహ్లీ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి మీరు ఎప్పుడూ స్ఫూర్తిప్రదాతగా నిలువాలని కోరుకుంటున్నా. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలి’ అని హైదరాబాదీ వీవీఎస్లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. వీళ్లతోపాటు రోహిత్, బుమ్రా, యువరాజ్, హర్భజన్, రైనా, బ్రెట్ లీ తదితరులు కూడా శుభాకాంక్షలు చెప్పారు.