
ఓ మామూలు హీరోగా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ప్యాన్ ఇండియా స్థాయిలోనే కాదు.. ప్రపంచస్థాయిలో పేరు సంపాదించాడు. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఎవరూ అందుకోలేనంత స్థాయికి చేరుకున్నాడు. ‘సాహో’తో పూర్తిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. నిజానికి ఈ సినిమా కొన్ని ఏరియాల్లో విజయం సాధించలేదు. కానీ దేశం మొత్తాన్నీ ఊపేసిందని చెప్పాలి. అంతేకాదు.. రీసెంట్గా ఒక బుకింగ్ వెబ్ సైట్ రిలీజ్ చేసిన ట్రెండింగ్ మూవీస్ లిస్ట్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ఉంది. అంటే ప్రభాస్ పట్ల, అతని సినిమా పట్ల ఉన్న ఆసక్తి ఎలాంటిదో అర్థమవుతోంది. అతనికంత క్రేజ్ ఉండబట్టే ఫిల్మ్ మేకర్స్ కూడా భారీ ప్రాజెక్టులతోనే వస్తున్నారు. రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘జాన్’ కూడా ప్యాన్ ఇండియా మూవీనే. ఆ తర్వా త అతనితో సినిమా తీసేందుకు యశ్ రాజ్ సంస్థ రెడీగా ఉందనే వార్తలొస్తున్నా యి. మరోపక్క ‘అర్జున్రెడ్డి ’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా చెప్పిన కథ నచ్చి ప్రభాస్ ఓకే అన్నాడని, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంటరవుతున్నా రని అంటున్నారు. అవన్నీ నిజమో కాదో తెలీదు కానీ.. ప్రభాస్తో సినిమా తీయాలనుకుంటున్నవారంతా భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారనేది మాత్రం వాస్తవం.