సంపత్ నందితో సాయి ధరమ్ నెక్స్ట్ మూవీ.. మెడపై త్రిశూలంతో అదిరిపోయిన మాస్ పోస్టర్

సంపత్ నందితో  సాయి ధరమ్ నెక్స్ట్ మూవీ.. మెడపై త్రిశూలంతో అదిరిపోయిన మాస్ పోస్టర్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తన నెక్స్ట్ ప్రాజెక్టు ను ప్రకటించారు. మాస్ దర్శకుడు సంపత్ నంది(Sampath nandi) దర్శకతంలో సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. శ్రీకర స్టూడియోస్(Srikara studios) సమర్పణలో వస్తున్న ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara entertainments), ఫార్ట్యూన్ ఫోర్(Fortune four cinemas) బ్యానర్స్ పై నాగవంశీ(Naga vamshi), సాయి సౌజన్య(Sai soujanya) నిర్మిస్తున్నారు. 

Also Read :- దిల్ రాజు అల్లుడి కారు కొట్టేశాడు

ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక మాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. SDT17 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా  పోస్టర్ లో సాయి ధరమ్ ఫేస్ క్లియర్ గా చూపించకుండా.. ఆయన మెడపై త్రిశూలం టాటూతో చాలా  పవర్ ఫుల్ గా చూపించారు. ఈ పోస్టర్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే సంపంత్ నది కూడా తన గత చిత్రాల మాదిరిగా మాస్ మసాలా సినిమా కాకుండా.. ఎదో కొత్త కాన్సెప్ట్ నే సెలెక్ట్ చేసుకున్నారనే విషయం అర్థమవుతోంది. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ హై ను అక్టోబర్ 15 ఉదయం 8:55 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక విరూపాక్ష లాంటి థ్రిల్లింగ్ హిట్ తరువాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.