సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తన నెక్స్ట్ ప్రాజెక్టు ను ప్రకటించారు. మాస్ దర్శకుడు సంపత్ నంది(Sampath nandi) దర్శకతంలో సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. శ్రీకర స్టూడియోస్(Srikara studios) సమర్పణలో వస్తున్న ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara entertainments), ఫార్ట్యూన్ ఫోర్(Fortune four cinemas) బ్యానర్స్ పై నాగవంశీ(Naga vamshi), సాయి సౌజన్య(Sai soujanya) నిర్మిస్తున్నారు.
Also Read :- దిల్ రాజు అల్లుడి కారు కొట్టేశాడు
A Thundering First High from our #SDT17 will be unveiled TOMORROW at 8:55 AM! ?
— Sithara Entertainments (@SitharaEnts) October 14, 2023
A @IamSampathNandi MASSS MISSILE? @IamSaiDharamTej @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/z4r8ymkG56
ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక మాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. SDT17 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్ లో సాయి ధరమ్ ఫేస్ క్లియర్ గా చూపించకుండా.. ఆయన మెడపై త్రిశూలం టాటూతో చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఈ పోస్టర్ మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే సంపంత్ నది కూడా తన గత చిత్రాల మాదిరిగా మాస్ మసాలా సినిమా కాకుండా.. ఎదో కొత్త కాన్సెప్ట్ నే సెలెక్ట్ చేసుకున్నారనే విషయం అర్థమవుతోంది. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ హై ను అక్టోబర్ 15 ఉదయం 8:55 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక విరూపాక్ష లాంటి థ్రిల్లింగ్ హిట్ తరువాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.