Sai Dharam Tej: ఒక్క మెసేజ్‌తో ఇద్దరు చిన్నారులకు సాయం.. నువ్వు గ్రేట్ సాయి ధరమ్ అన్నా

Sai Dharam Tej: ఒక్క మెసేజ్‌తో ఇద్దరు చిన్నారులకు సాయం.. నువ్వు గ్రేట్ సాయి ధరమ్ అన్నా

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కేవలం ఒకే ఒక్క మెసేజ్ కు స్పందించిన ఆయన ఇద్దరు చిన్నారుల వైద్య ఖర్చులకు సాయం అందించారు. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ ఐ ఆండ్రూ కి సూర్యాపేట జిల్లా చార్లెట్‌ అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లల వైద్యం కోసం సాయం కోరుతూ ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందట. 

ఆ సమయంలో తనకు సాయి ధరమ్ తప్పా వేరే పేరు గుర్తురాలేదని, వెంటనే ఆయనకు ఒక మెసేజ్ చేయగా.. పిల్లల ట్రీట్మెంట్ కోసం డబ్బులు పంపారని ఐ ఆండ్రూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక సాయిధరమ్ చేసిన సహాయానికి ఆ పిల్లలు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో కూడా పంపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సాయి ధరమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే విరూపాక్ష సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన.. ఇటీవల గాంజ శంకర్ సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే  మొదలయ్యింది. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.