ఎక్కడున్నా.. గౌరవంగా ఉండాలి.. సాయి పల్లవి కామెంట్స్కు ఆడియన్స్ ఫిదా

ఎక్కడున్నా.. గౌరవంగా ఉండాలి.. సాయి పల్లవి కామెంట్స్కు ఆడియన్స్ ఫిదా

సాయి పల్లవి(Sai Pallavi).. ఈపేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సాయి పల్లవి. మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej) హీరోగా వచ్చిన ఫిదా(Fida) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నేచురల్ బ్యూటీ.. తెలుగునాట మంచి క్రేజ్ సంపాదించుకుంది. నిజానికి సాయి పల్లవి సినిమాల కన్నా ఎక్కువ తన వ్యక్తిత్వం తోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. 

ముందు నుండే సాయి పల్లవి చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. రెమ్యునరేషన్ కోసం ఎలాంటి పాత్రలకైనా ఓకే చెప్పే రకం కాదు ఆమెది. ఆమె ఒక సినిమాను ఒకే చేసిందంటే ఆందులో ఖచ్చితంగా ఎదో విషయం ఉండే ఉంటుంది. అలాగే గ్లామర్ షో కు కూడా చాలా దూరంగా ఉంటారు సాయి పల్లవి. అందుకే ఆమెను ఎక్కువ మంది ఇష్టపడతారు.

ఇదే విషయం గురించి ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సాయి పల్లవి. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమమ్ సినిమా ఆఫర్ వచ్చేవరకు నటనపై అంత ఆసక్తిలేదు. ఇంట్లోవాళ్ళు కూడా షాకయ్యారు. అప్పుడు మా నాన్న ఒక మాట చెప్పారు. జీవితం ఎటువైపు తీసుకెళ్తే అదే మన పని కానీ.. ఒకటి గుర్తుపెట్టుకో.. ఎక్కడున్నా గౌరవంగా ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, గౌరవంగానే వెళ్ళిపోవాలి అని. ఈ మాటలను నేను ఎప్పటికి మర్చిపోను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మాటలు విని ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మా సాయి పల్లవి గోల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి.. ఇటీవలే తన కొత్త సినిమాను మొదలు పెట్టింది. తెలుగులో నాగ చైతన్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.