న్యూఢిల్లీ: స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్లను తయారు చేసే సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లోయ్స్ లిమిటెడ్ ఈ నెల 30 న ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది. ఐపీఓ ద్వారా రూ.15 కోట్లు సేకరించనుంది. ఈ ఎస్ఎంఈ ఐపీఓ వచ్చే నెల 3 న ముగుస్తుంది.
ఒక్కో షేరును రూ.60 కి అమ్ముతున్నారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్టింగ్ ఉంటుంది. కిందటేడాది ఏప్రిల్–డిసెంబర్లో కంపెనీకి రూ.1.79 కోట్ల నికర లాభం వచ్చింది.