ఉప్పల్​ స్కైవాక్ పిల్లర్​ను ఢీకొన్న ఇసుక లారీ

ఉప్పల్​ స్కైవాక్ పిల్లర్​ను ఢీకొన్న ఇసుక లారీ

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ చౌరస్తాలోని స్కైవాక్ పిల్లర్​ను ఓ ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఇసుక లోడుతో బోడుప్పల్ ​నుంచి వస్తున్న లారీ ఉప్పల్​చౌరస్తాలో అదుపుతప్పి స్కైవాక్ ​పిల్లర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. స్కైవాక్ పిల్లర్ కింది భాగం కొంత దెబ్బతింది. డ్రైవర్ మోహన్ ​నాయక్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ను బయటకు తీసి సమీపంలోని హాస్పిటల్​కు తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్ ​చౌరస్తాలోని స్కైవాక్ ​నిర్మాణం పూర్తయి చాలా రోజులు అవుతున్నా.. అధికారులుమాత్రం ఇంకా  ప్రారంభించడం లేదు.