ఉప్పల్, వెలుగు: ఉప్పల్ చౌరస్తాలోని స్కైవాక్ పిల్లర్ను ఓ ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఇసుక లోడుతో బోడుప్పల్ నుంచి వస్తున్న లారీ ఉప్పల్చౌరస్తాలో అదుపుతప్పి స్కైవాక్ పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. స్కైవాక్ పిల్లర్ కింది భాగం కొంత దెబ్బతింది. డ్రైవర్ మోహన్ నాయక్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసి సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్ చౌరస్తాలోని స్కైవాక్ నిర్మాణం పూర్తయి చాలా రోజులు అవుతున్నా.. అధికారులుమాత్రం ఇంకా ప్రారంభించడం లేదు.