శ‌శిక‌ళకు చెందిన రూ.1600 కోట్ల ఆస్తులు జ‌ప్తు

శ‌శిక‌ళకు చెందిన రూ.1600 కోట్ల ఆస్తులు జ‌ప్తు

త‌మిళ‌నాడు దివంగ‌త  సీఎం జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ ఆస్తుల‌ను ఆదాయపన్ను శాఖ (IT) అధికారులు జ‌ప్తు చేశారు. ఆమెకు చెందిన సుమారు రూ.1600 కోట్ల విలువైన ఆస్తుల‌ను బినామీ చ‌ట్టం కింద అటాచ్‌ చేశారు. కాగా, ఇందులో మరో ముఖ్య విశేషమేమంటే రూ. 1600 కోట్లలో.. రూ. 1500 కోట్ల విలువైన ఆస్తులు నోట్ల రద్దు సమయంలో పలువురి పేర్ల మీద కొనడం గమనార్హం. IT అధికారులు ఆమెకు సంబంధించిన సుమారు 10 కంపెనీల‌పై దాడులు నిర్వహించి ఈ ఆస్తుల‌ను సీజ్ చేశారు. గ‌త రెండేళ్లుగా శ‌శిక‌ళ బెంగళూరులోని అగ్ర‌హారం జైలులో శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు.