
కృత్రిమ మేధస్సు వేగంగా సాంకేతిక రంగాన్ని మారుస్తోంది.. AI వ్యవస్థలు కేవలం సాంకేతిక ఆవిష్కరణలకే కాదు.. స్పష్టమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించే దిశగా ఉపయోగించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పారు సత్యానాదెళ్ల. AI కేవలం సాంకేతిక ఆవిష్కరణల కోసం కాకుండా నిజమైన ప్రపంచ సమస్యలను పరిష్కారిని ఉపయోగపడాలి..భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ AI ఇంకా గణనీయమైన ఆర్థిక విలువను అందించలేదన్నారు మైక్రోసాఫ్ట్ చీఫ్.
సత్య నాదెళ్ల చెప్పిన - కీలక అంశాలు:
AI భారీ మొత్తంలో శక్తిని వినియోగిస్తున్నాం.. ఈ శక్తి వినియోగానికి తగినట్లుగా AI సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన విలువను సృష్టించాలని నాదెళ్ల నొక్కి చెప్పారు. AI అసలు పరీక్ష ఏమిటంటే అది రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందా లేదా అనేది అని ఆయన అన్నారు.
AI ప్రధానంగా ఉత్పాదకతను పెంచే సాధనంగా ఉండాలని నాదెళ్ల భావిస్తున్నారు. పారిశ్రామిక విప్లవం లాగా AI ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలి. 10% లేదా 7% ఆర్థిక వృద్ధి రేట్లను, ద్రవ్యోల్బణం సర్దుబాటును సాధించగలిగితేనే AI నిజమైన ప్రభావం తెలుస్తుందని అన్నారు.
AI ఆరోగ్య సంరక్షణ, విద్య , ఆఫీసు డాక్యుమెంట్ల నిర్వహణ వంటి రంగాలలో ప్రక్రియలను సులభతరం చేయడం, సామర్థ్యాన్ని పెంచడం, మొత్తం ఉత్పాదకతను పెంచడం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని నాదెళ్ల చెప్పారు. ఉదాహరణకు ఆసుపత్రులలో రోగుల డిశ్చార్జ్ ప్రక్రియలను AI ద్వారా మెరుగుపరచడం ద్వారా సమయం, డబ్బు ,శక్తిని ఆదా చేయవచ్చని ఆయన చెప్పారు.
AI కోడ్ రాయడంలో సహాయపడినప్పటికీ.. లాజికల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ ,సమస్యలను తార్కికంగా పరిష్కరించే మానవ సామర్థ్యం ఎల్లప్పుడూ కీలకమని నాదెళ్ల పదే పదే నొక్కి చెప్పారు. AI పునరావృత పనులను చేస్తుంది. కానీ సమస్యలను రూపొందించడం,వ్యవస్థలను రూపొందించడం మానవుల చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లుగా మారే దిశగా వెళ్తున్నారని ఆయన వివరించారు.
AI వ్యవస్థల భారీ శక్తి వినియోగం జరుగుతున్న క్రమంలో వాటి విస్తరణకు సామాజిక అనుమతి అవసరమని నాదెళ్ల చెప్పారు. AI సామాజిక ,ఆర్థిక విలువను సృష్టించకపోతే మనం దానిని ఉపయోగించినా వ్యర్థం అన్నారు సత్యానాదెళ్ల.