బీఆర్ఎస్​ మ్యేనిఫెస్టోతో ప్రతిపక్షాలు పరేషాన్: సత్యవతి రాథోడ్​

బీఆర్ఎస్​ మ్యేనిఫెస్టోతో ప్రతిపక్షాలు పరేషాన్: సత్యవతి రాథోడ్​

మహబూబాబాద్, వెలుగు : బీఆర్​ఎస్​ మేనిఫెస్టోతో ప్రతిపక్ష నేతలు పరేషన్​అవుతున్నారని మంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్​లో ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే  నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు పాత గతే  పడుతుందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు  డబ్బులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు.

 జిల్లాలోని బీఆర్ఎస్​నాయకులు కలిసి కట్టుగా పని చేసి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్​ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.