ఎయిర్ పోర్టులో సౌదీ కరెన్సీ సీజ్

ఎయిర్ పోర్టులో సౌదీ కరెన్సీ సీజ్

శంషాబాద్, వెలుగు: సౌదీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న ప్యాసింజర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం సయ్యద్ ఫర్హాన్(22) అనే వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ఫ్లైట్ లో షార్జా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అతడి లగేజీలో సౌదీ కరెన్సీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. 30 వేల సౌదీ రియాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ ఫర్హాన్ పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.