
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ కు రెండు స్వర్ణ పథకాలు లభించాయి. 48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్ అల్టాంట్సెట్సెగ్ను 5-0 తేడాతో ఓడించి నీతూ ఘంఘూస్ స్వర్ణం పతకం గెలిచింది. ఇక 81 కేజీల విభాగం ఫైనల్లో భారత బాక్సర్ సావిటీ బూరా చైనాకు చెందిన వాంగ్ లీనాను ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో ప్రత్యర్థిపై తొలి రౌండ్ నుంచే పంచ్లతో సావిటీ విరుచుకుపడింది.
రెండో రౌండ్ లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో రౌండ్ లో పూర్తి ఆధిపత్యం కనబరిచి 4-3తో స్వర్ణం కైవసం చేసుకుంది. టోర్నమెంట్ చరిత్రలో స్వర్ణం గెలిచిన ఏడో భారతీయ మహిళగా సావీటీ స్థానంలో నిలిచింది. అంతకుముందు 48 కేజీల విభాగంలో నీతూ ఘంగాస్ భారత్కు తొలి బంగారు పతకం అందించింది. ఫైనల్లో మంగోలియాకు చెందిన లుట్సాయ్ఖాన్ అల్టాంట్సెట్సెగ్పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది.