కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్ఎదుట సోమవారం మద్నూర్ మండలం అవల్గావ్కు చెందిన పి.సిద్ధప్ప అనే వ్యక్తి పెట్రోల్పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడున్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మద్నూర్ మార్కెట్కమిటీలో రూ.5 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని, గతంలో తాను ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎంక్వైరీ చేయడం లేదని, ఈ విషయం తెలుసుకొని స్థానిక ఆఫీసర్లు, బీఆర్ఎస్ లీడర్లు తనను వేధిస్తున్నారని పేర్కొన్నాడు.
ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఎంక్వైరీ కూడా చేయలేదన్నాడు. తన వద్ద ఉన్న ఆధారాలతో గతంలోనే ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని, చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆఫీసర్లకు తెలిపానని, అప్లికేషన్కూడా రాశానన్నారు. పొద్దున కలెక్టరేట్లోని ప్రజావాణి వద్దకు వచ్చి వెళ్లిన సిద్ధప్ప.. మధ్యాహ్నం తర్వాత కలెక్టరేట్ మెయిన్ గేట్ బయట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్సై ఉదయ్ శేఖర్, ఇతర సిబ్బంది అతన్ని కాపాడారు. పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టె లాక్కున్నారు. అనంతరం దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు సేకరించి పంపారు.