V6 News

స్కాలర్స్ విద్యార్థుల విజయ దుందుభి

స్కాలర్స్ విద్యార్థుల విజయ దుందుభి

వనపర్తి, వెలుగు : ఇంటర్మీడియట్​ ఫలితాల్లో   స్కాలర్స్​ జూనియర్​ కాలేజీ విద్యార్థులు  విజయదుందుభి మోగించారని  ప్రిన్సిపాల్స్​ శ్రీధర్​, మధుసూదన్ ​గుప్తా ​ ​ తెలిపారు.  బీపీసీలో బి.మహాలక్ష్మి 993, అలీషాసాజి 992, సుష్మిత 991, బాంధవి 990 మార్కులు సాధించారని, ఎంపీసీలో కె.నర్మద 992, కె.శిరీష 991, కె.లలిత 989, సీఈసీలో  టి.శ్రావణి 771  మార్కులు సాధించారన్నారు.

జూనియర్​ బీపీసీలో  డి.పల్లవి, నిమ్రఆఫ్సిన్​లు 437, బి.అక్షయలక్ష్మి 436, భవ్యశ్రీ, కె.యామిని, సాత్విక, కె.రాజేశ్​  434, ఇందు, అఖిలాండేశ్వరి, గేయశ్రీ, అఖిలలు 432 మార్కులు సాధించారన్నారు.  ఎంపీసీలో ఎ.బన్ని 463, జి.హర్షిత, శ్రీవర్షిని 462, దివ్యశ్రీ 460 మార్కులు, సీఈసీలో ముస్కన్​ 40 6మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను డైరెక్లర్లు జగదీశ్వర్​, వరప్రసాదరావు, నాగేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి అభినందించారు.