తేలు కుడితే ఆ మంటకు అల్లాడిపోతాం. కానీ, ఆ తేలు విషమే మందులకు లొంగని టీబీ (క్షయ)కి మంచి మందుగా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో తేలు విషం ప్రాణాంతక బ్యాక్టీరియాను చంపేసినట్టు అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. ఆ విషం ప్రభావం ఆరోగ్యకరమైన కణాలపై పడలేదని తేల్చారు. మెక్సికోలో దొరికే డైప్లోసెంట్రస్ జాతికి చెందిన తేళ్ల విషంలో రెండు రకాల రసాయనాలు యాంటీ బ్యాక్టీరియల్స్గా పనిచేస్తున్నాయన్నారు. ఆ విషాన్ని సేకరించడమే చాలా ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు. విషాన్ని తీసి మందుగా మార్చాలంటే ఒక గాలన్ (3.8 లీటర్లు)కు సుమారు రూ.300 కోట్లు (3.4 కోట్ల పౌండ్లు) ఖర్చవుతుందని చెప్పారు. బెంజోక్వినోన్ గ్రూప్కు చెందిన కాంపౌండ్లు టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాను, చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేసిందన్నారు.