హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 3,740 మందికి స్క్రీనింగ్ చేశామని, ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ప్రభుత్వం తెలిపింది. గురువారం రాత్రి ఈ మేరకు హెల్త్ బులెటిట్ను విడుదల చేసింది. వైరస్ అనుమానంతో గాంధీ హాస్పిటల్కు 75 మంది రాగా, వారిలో 53 మందికి ఎలాంటి లక్షణాలు లేవని డాక్టర్లు తేల్చారు. మిగిలిన 22 మంది జలుబు, దగ్గు లక్షణాలు ఉండటంతో శాంపుల్స్ సేకరించారు. దీంట్లో పది రిజల్ట్స్ నెగెటివ్ రాగా, మరో 12 మందికి పెండింగ్లో ఉన్నాయని అధికారులు ప్రకటించారు.
For More News..