దేశ రాజధానిలో రెండో ఒమిక్రాన్ కేసు

దేశ రాజధానిలో రెండో ఒమిక్రాన్ కేసు

కరోనా కొత్త వేరియెంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కొత్త వేరియంట్ బారినపడ్డ వ్యక్తి జింబాంబ్వే నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. సదరు బాధితుడు సౌతాఫ్రికాలో కూడా పర్యటించాడు. ఢిల్లీలో వెలుగుచూసిన కేసుతో కలిపి దేశంలో ఇప్పటి వరకు 33 ఒమ్రికాన్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 7,992 కరోనా కేసులు రికార్డుకాగా.. 9,265 మంది రికవర్ అయ్యారు.