సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచికొని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. రైలు నెం 07071 (సికింద్రాబాద్- కాకినాడ టౌన్) సెప్టెంబర్ 02న శనివారం సికింద్రాబాద్ నుండి రాత్రి 9:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు(సెప్టెంబర్ 03) ఉదయం 8:45 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.

ALSO READ:స్టూడెంట్స్ కు పండగే.. సెప్టెంబర్ నెలలో ఎన్ని సెలవులంటే..

ఈ ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. రైలు నంబర్ 07072 (కాకినాడ టౌన్-సికింద్రాబాద్) సెప్టెంబర్ 03 ఆదివారం కాకినాడ టౌన్ నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మౌలా-అలీ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో AC ఫస్ట్ క్లాస్, 2A, 3A, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.