సికింద్రాబాద్ అల్లర్లలో ప్రత్యక్షంగా 12 కోట్ల ఆస్తినష్టం

సికింద్రాబాద్ అల్లర్లలో ప్రత్యక్షంగా 12 కోట్ల ఆస్తినష్టం

సికింద్రాబాద్ లో జరిగిన అల్లర్లలో ప్రత్యక్షంగా 12 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా తెలిపారు. రైళ్ల రద్దు వల్ల టికెట్స్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నామని..ప్రయాణికుల సామాగ్రి కూడా భారీగా ధ్వంసం అయిందన్నారు. పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. 5 రైలు ఇంజన్స్, 30 బోగీలు ధ్వంసం అయ్యాయని.. జరిగిన ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నామన్నారు. పార్సిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయ్యిందన్న గుప్తా..పవర్ కార్కు భారీ ప్రమాదం తప్పిందని చెప్పారు. ఒకవేళ పవర్ కార్కు మంటలు అంటుకుంటే భారీ ఆస్తి , ప్రాణ నష్టం జరిగేదని తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు స్పష్టం చేశారు.