- ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి కిందకి వేలాడుతూ హల్చల్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గురువారం ఓ మానసిక రోగి కలకలం సృష్టించాడు. ఉదయం 8.30గంటలకు రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించిన అకస్మాత్తుగాకేకలు వేస్తూ, అటూఇటు పరిగెత్తడంతో ప్రయాణికులు భయపడ్డారు. నాలుగో నంబర్ప్లాట్ఫాం ఫుట్ఓవర్ బ్రిడ్జి పై నుంచి కిందకి వేలాడడంతో ప్రయాణికులు దూకవద్దంటూ గట్టిగా అరిచారు.
అంతలో ఓ ప్యాసింజర్సదరు వ్యక్తిని పైకి లాగాడు. రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికి బంధువులు రావడంతో కౌన్సెలింగ్ఇచ్చి అప్పగించారు. సదరు వ్యక్తి మెదక్ జిల్లా చేగుంట మండలం తిమ్మయ్యపల్లికి చెందిన కరణ్తోర్ రతన్(32) అని, మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు.
